షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఆత్మకూరు నియోజకవర్గం: అనంతసాగరం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో అన్ని మండలాలు కన్నా అనంత సాగరం మండలంలో సుమారు వందకు పైచిలుకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. గత నెల 10, 11,12, తేదీన జరపవలసిన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. దేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్న వ్యక్తికి ఐదు లక్షల ప్రమాద బీమా పాలసీ ప్రవేశ పెట్టడం వలన ప్రమాదవశాత్తు.. ఆ వ్యక్తిచనిపోతే ఆ కుటుంబ సభ్యులకు ఆదుకోవడానికి మా అధ్యక్షులు గౌరవయులైన శ్రీ పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి షేక్ సైఫ్యూల్ల, అనంతసాగర్ మండలం జనసేన పార్టీ నాయకులు షేక్ జావేద్, పటాన్ ఖాదర్ బాషా, కార్యదర్శి ఎం. పెంచలయ్య, సంయుక్త కార్యదర్శి షేక్ ఖాజా మస్తాన్, క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జనసైనికులు పాల్గొనడం జరిగింది.