వరదయ్యపాలెంలో జనసేన మండల కమిటీ సమావేశం

సత్యవేడు: ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాలు మేరకు సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ మరియు కమిటీ సభ్యులు హాజరయ్యారు. చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ రాబోయే 5 నెలలు చాల కీలకం అని, తెలుగుదేశం పార్టీ తో కలసి ప్రజా సమస్యలు మీద పోరాడాలని, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.