అంతర్వేదిపాలెం కళ్యాణ మండపం నందు వారాహి విజయ యాత్ర సమావేశం

రాజోలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో వారాహి విజయ యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గానికి విచ్చేయుచున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయడానికి సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్యక్షతన అంతర్వేదిపాలెం కళ్యాణ మండపం నందు వారాహి విజయ యాత్ర రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ మధుసూదన్ రెడ్డి, అమ్మిశెట్టి వాసు మరియు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ సమక్షంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాజోలు నియోజకవర్గ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.