“వారాహి యాత్ర” విజయవంతం కావాలి: రాచర్ల జనసేన

గిద్దలూరు: జనహితం కోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ జూన్ 14వ తారీఖున చేపట్టబోతున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని, శనివారం రాచర్ల మండల జనసేన అధ్యక్షులు పుట్టా బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విజయం పథంగా అంతిమ లక్ష్య సాధనకు శ్రీ శ్రీ శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి అనుగ్రహం ఉండాలని, భక్తి శ్రద్ధలతో రంగనాయక స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిస్వార్థ రాచర్ల మండల జనసైనికుల సమక్షంలో ఘనంగా జరిగింది.