వారాహి యాత్ర విజయవంతం చేయాలి

రాజోలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబందించి రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చిలకం మధుసుదన్ రెడ్డి మలికిపురం సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసి మన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, మండల ఎంపీపీలు, మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.