వారాహి యాత్ర విజయవంతం – తుని జనసేన ఆధ్వర్యంలో అన్నదానం

తుని: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన వారాహి విజయ యాత్ర మొదటి రెండు విడతలు విజయవంతం అయిన సందర్భంగా తుని నియోజకవర్గం జనసైనికులు, నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు 200 మంది యాచకులకు, వృద్దులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్, తొండంగి మండల అధ్యక్షులు నాయుడు, తుని మండల అధ్యక్షులు రమణ, జనసేన శివ, దుర్గాప్రసాద్, భాస్కర్, వంశీ, శ్రీను, శివ నారాయణ, బొప్పన రాంబాబు, బాలాజీ మరియు జనసైనికులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.