రాయవరంలో దిగ్విజయంగా పవనన్న ప్రజాబాట 101వ రోజు

  • రాజంపేట అసెంబ్లీ ఇంచార్జీ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం: సుండుపల్లి మండలం, రాయవరం పంచాయతీలోని పల్లెలు కావలి పల్లి, రాయవరం అర్జునవాడ, రాయవరం, రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సుడిగాలి పర్యటనలో భాగంగా పవనన్న ప్రజాబాట 101 రోజు కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మాట్లాడుతూ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అని మాకు వివరించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. మన దేశం, మన పిల్లల్లా భవిష్యత్తు భాగుపడలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే బాగుంటుందని ప్రజలకు వివరించారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి రాతల రామయ్య, జనసెన నాయకులు రామ శ్రీనివాస్, భాస్కర పంతులు, కత్తి సుబ్బరాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.