వారాహి యాత్ర జరిగి తీరుతుంది: లింగోలు పండు

  • ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వారాహి యాత్ర జరిగి తీరుతుంది

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క వైసీపీ నాయకులలో వెన్నులో వణుకు పుడుతుందని అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు అన్నారు. మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత అత్యవసరంగా సెక్షన్ 30 ఎందుకు అమలు చేశారో చెప్పాలని అన్నారు. అధికార వైసిపి అనేక బహిరంగ సభలు పెట్టుకున్నప్పుడు, మీ నాయకుల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నప్పుడు ఎందుకు సెక్షన్ 30 అమలు చేయట్లేదని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో వస్తున్నాడని చెప్పి ఇప్పుడు ఎందుకు సెక్షన్ 30 అమలు చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం అన్నారు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా జూన్ 14వ తేదీన అన్నవరంలో వారాహి యాత్ర మొదలు అవుతుందని, ప్రతీ నియోజకవర్గంలో వారాహి యాత్ర జరిగి తీరుతుందని, యాత్రకి జనసైనికులు అందరూ అండగా ఉంటారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వారాహి యాత్ర జరిగి తీరుతుంది అని పండు అన్నారు.