జనసైనికునికి ఆర్దికసాయమందించిన వరికూటి నాగరాజు
పర్చూరు నియోజకవర్గం, ఇటివల జరిగిన అగ్ని (గ్యాస్) ప్రమాదంలో ఇళ్లు పూర్తిగా కాలి బూడిద అయి, జీవనోపాధిని కోల్పోయి ఇబ్బంది పడుతున్న పర్చూరు నియోజకవర్గం పూసపాడు నిస్వార్థ జనసైనికులు తంగెళ్ళ చిరంజీవికి ఆదివారం వారి ఇంటి వద్దకు వెళ్లి 25,000/- రూపాయలు వారి సొంత నిధుల నుంచి విరాళాన్ని అందించిన దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావు, నూగుల కోటేశ్వరరావు, ఇంకొల్లు జనసైనికులు వెంకటేష్,శివ, రిటైర్డ్ ఆర్మీ శ్రీనివాసులు, నీలిశెట్టి సురేష్ మరియు పర్చూరు నియోజకవర్గం దర్శి నియోజకవర్గం జనసైనికులు పాల్గొనడం జరిగినది.