వాసిరెడ్డి పద్మ నోరు అదుపులో పెట్టుకో: కుప్పాల జ్యోతి

అనంతపురం: నోరు అదుపులో పెట్టుకో వాసిరెడ్డి పద్మ అంటూ ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ కుప్పాల జ్యోతి హెచ్చరించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. చేసిన అభివృద్ధి శూన్యం మాటలు మాత్రం కోటలు దాటుతాయి. జగన్ రెడ్డి మీ నాయకుడు జగన్ రెడ్డి జిల్లా అయినటువంటి కడప జిల్లాలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు పేదలకు ఇచ్చిన పథకాలు ఎంతవరకు అందాయి. నేడు నిజమైన పేదలు ఎంతమంది లబ్ది పొందారు. మీ దగ్గర దాఖలాలు ఏమైనా ఉన్నాయా?.. ఇకపోతే మా మాటకొస్తే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడే అర్హత మీకుందా.. మీరు మీ నాయకుడు గురించి తెలుసుకోకుండా మీ నాయకుడు చరిత్ర గురించి తెలుసుకోకుండా అ పార్టీలో నాయకులయ్యారంటే హాస్యాస్పదంగా ఉంది.. మనం ఒక పార్టీలో ఉన్నామంటే మన నాయకుడు ఒక నిజాయితీ తెలుసుకోవాలి. మనం నడిస్తే ప్రజలకు మనకు మంచి మార్గం చూపిస్తాడు అంతేగాని మీ నాయకుడికి చరిత్ర చంచల్ గూడా అని తెలుసుకోకుండా ప్రయాణం చేసే మీరు కూడా మాట్లాడుతారా!. ఒక్కసారి మీ నాయకుడు చరిత్ర తిరగేసినట్టు అయితే ఆయన ముత్తాత వెంకట్ రెడ్డికి ఎన్ని పెళ్లిళ్లు, ఆయన తాత రాజారెడ్డికి ఎన్ని పెళ్లిళ్లు, ఆయన చెల్లి షర్మిలాకు ఎంతమంది భర్తలు ఉన్నారో తెలుసుకోకుండా మీరు కూడా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డలు డేటా మిస్సవుతుంది అని అడిగితే ఒక వ్యవస్థను తప్పుపట్టారని ఆయన మీద బుడద చల్లే ప్రయత్నం మీరు చేస్తున్నారా?.. గుర్తుపెట్టుకోండి వినాశకాలే విపరీత బుద్ధి. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. 2024లో 175 అన్న మీకు డిపాజిట్లు కూడా లేకుండా చేస్తామని నేను గట్టిగా చెప్తున్నాను. ఇకపోతే మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడితే రాజధాని లేదని ప్రజలు అడిగితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అని అంటారా.. పోలవరం ఏమైందని ప్రజలు అడిగితే దత్త పుత్రుడు అని అంటారా? మీరు చేసే వికృతి చేష్టలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారు. ఒకప్పుడు మీరు కడప మా కంచుకోట అని చెప్పేవారు. 2024లో ఆ కంచ కోట శిబిరాలను బద్దలు కొట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జగన్ మోహన్ రెడ్డి అనే ఉన్మాదికి పట్టిన అహంకారాన్ని దించి మెడలు వంచి అధికారాన్ని చేపట్టి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడుతాడని తెలుసుకో వాసిరెడ్డి పద్మ. ఇకపోతే ఈరోజు అధికారంలో లేకపోయినా గుండెల మీద చెయ్యి వేసుకుని మేము చెప్పగలం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు అండగా నిలిచారు. అధికారం వస్తే మా నాయకుడు ఇంకెంత చేస్తాడు ఒకసారి గుర్తుంచుకో వాసిరెడ్డి పద్మ. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా ఆడబిడ్డ కన్నుల వెంట కన్నీటికి అండగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య అని గుర్తుపెట్టుకో వాసిరెడ్డి పద్మ అని హితవు పలికారు.