వెహికల్స్ పార్కింగ్ అవగాహనా కార్యక్రమం

  • అంబులెన్స్ లకు అడ్డం లేకుండా వెహికల్స్ పార్కింగ్ చేయండి.. ఫ్లెక్సీల ఏర్పాటు

విశాఖపట్నం సీతమ్మధార సమీపంలో చైతన్య నగర్ లో ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడి, సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ మరియు సంస్థ ప్రతినిధులు- శ్రీ రవితేజ వెహికల్స్ పార్కింగ్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.”అమ్మను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి దయచేసి దారికి అడ్డం లేకుండా మీ వెహికల్స్ పార్కింగ్ చేయండి” ఈ వాక్యంతో ఫ్లెక్సీలు వేయించి, పల్సుస్ హెల్త్ టెక్ సంస్థ ఛైర్మన్ గేదెల శ్రీను బాబు సహకారంతో, చైతన్య నగర్ లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, వెహికల్స్ పార్కింగ్ విషయంలో సామాజిక చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. గత 40 సంవత్సరాలుగా స్ధానికంగా నివాసం ఉంటున్న భద్రరావు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడిని ప్రత్యేకంగా అభినందించారు.