ప్రజాక్షేమమే పరమావధిగా భావించే పవన్ కళ్యాణ్ కి ‌సంఘీభావంగా నిలవండి – బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

  • ‘జనంకోసం జనసేన’ ‘మహా పాదయాత్ర’ 29వ రోజు

రాజానగరం, ‘జనం కోసం జనసేన’ ‘మహా పాదయాత్ర’ 29వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది. రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనసేన శ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాల ముద్రించిన కరపత్రాలు పంచుతూ, నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాప కింద నీరులా రాష్ట్రం నలుమూలల ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని, జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది. జనసేన మహా పాదయాత్రలో మట్ట వేంకటేశ్వర రావు, గోకాడ సూర్యవతి, వేణు, బైలపూడి శ్రీను, మేడవర్తి సూరిబాబు, చిక్కం నాగేంద్ర, పిండి వివేక్, ముత్యాల మహేష్, ఆకుల సుబ్బు, ముత్యాల హరీష్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.