నీటి కుళాయిల ప్రారంభోత్సవంలో పాల్గొన్న విడివాడ

తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, బొంతు వారి పాలెం మధ్య వీధిలో నివసిస్తున్న వారికి స్మశాన వాటికలో స్నానానికి నీటి కుళాయిలు లేనందున బొంతు వారి పాలెం మధ్య వీధి రామాలయ సంఘం సభ్యుల కోరిక మేరకు అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ ఆర్థిక సహాయంతో స్నానానికి నీటి కుళాయిలు మరియు రామాలయం చుట్టూ మరియు రావి చెట్టు చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీటి కుళాయిలను తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొంతు వారి పాలెం మధ్య వీధి రామాలయం సంఘ సభ్యులు విడివాడ రామచంద్రరావు దాసం ప్రసాద్ ని ఎంపిటిసి మరియు 18 వ వార్డు మెంబర్ దిరిశాల వెంకట్ ని శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ సెక్రటరీ దిరిశాల వెంకట్ ఎంపిటిసి బుద్దాల రాంబాబు 18 వ వార్డు మెంబర్ ఈడూరు రాంబాబు, కట్ట అప్పలపల్లి మరియు అత్తిలి మండలం తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.