జనసేన పార్టీ పేద ప్రజలకి అండగా నిలబడే పార్టీ అని నిరూపించిన విక్రమ్ సందీప్

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, జి సిగడాం మండలం, మర్రివలస గ్రామంలో ఎస్టి కాలనీలో గత 70 ఏళ్లుగా మంచినీటి సమస్య ఉంది. అక్కడి ప్రజలు మంచినీటి కోసం కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి మంచి నీరు తెచ్చుకునే పరిస్థితి. ఆ విషయాన్ని అక్కడ జనసేన సర్పంచ్ అభ్యర్థి అయిన విక్రమ్ సందీప్ తెలుసుకుని సొంత నిధులతో గ్రామ జనసైనికుల సహకారంతో కేవలం 10 రోజుల్లోనే సమస్య పరిస్కారం చేసారు. ఎస్టి కాలనీలో ప్రతి ఇంటికి మంచి నీరు అందేలా కుళాయి ఏర్పాటు చేసి జనసేన పార్టీ పేద ప్రజలకి అండగా నిలబడే పార్టీ అని తెలిసేలా చేయటం జరిగింది.