మావుళ్ళమ్మ జాతరలో పాల్గొన్న వినుత కోటా

శ్రీకాళహస్తి మండలం, శనగలమిట్ట హరిజనవాడలో జరిగే మావుళ్ళమ్మ పొంగళ్ళు జాతరకు గ్రామస్థులు, జనసైనికుల ఆహ్వానం మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా పాల్గొని.. అమ్మ వారిని దర్శించుకొని, పూజలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, మహిళలు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.