అంబేద్కర్ కు నివాళులు అర్పించిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి: డా. బి.ఆర్.అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు నాయకులు, వీరమహిళలు, జనసైనికులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్ గారు కన్న కలలు నెరవేరాలంటే, నిజమైన రాజ్యాంగ విలువలు పరిరక్షించాలంటే జనసేన పార్టీ అధికారం లోకి వస్తేనే సాకారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట గణేష్, పేట చంద్ర శేఖర్, పేట చిరంజీవి, గురవయ్య, రాజేష్, సురేష్ , దినేష్, ఉదయ్, జ్యోతి రామ్, వీరమహిళలు శారద, గాయత్రి, నిర్మల, జయలలిత జనసైనికులు గోపి, బబ్లూ, వంశీ తదితరులు పాల్గొన్నారు.