వేడంగిలో జోరందుకున్న కూటమి ప్రచారం

పాలకొల్లు నియోజకవర్గం, వేడంగి గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారం అభ్యర్థుల సతీమణుల రాకతో జోరందుకుంది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్ధి రామానాయుడు సతీమణి సూర్యకుమారి, మరియు నరసాపురం పార్లమెంటరీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాస వర్మ సతీమణి దేవి శ్రీనివాస వర్మ పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. వేడంగి గ్రామ ప్రజలు అడుగడుగునా వారికి నీరాజనం పట్టారు. ఈ ప్రచారయాత్ర కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.