కేతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పోలిరెడ్డి వెంకటరత్నం

నిడదవోలు నియోజకవర్గం: నిడదవోలు మండలం, ఉనకరమిల్లి గ్రామంలో జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ పై కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిడదవోలు మండలం జనసేన ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో జనసేన మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ ఏంటి కేతంరెడ్డి వినోద్.. ఒక్కరోజులోనే డ్యూటీ ఎక్కేశావా, ఐదేళ్ళ నుండి జనసేన పార్టీ గొప్పదనం ఏంటంటే అధినేత పవన్ కళ్యాణ్ గారి మంచితనం గురించి అరచి అరచి ప్రజల్లో చెప్పిన నువ్వు ఒక్కరోజులో దొంగల పార్టీలో చేరగానే ఇంత చక్కగా ప్లేట్ మార్చేసి ఎలా మాట్లాడుతున్నావ్ అని ప్రజలకు అర్థమైంది. జనసేన అధినేత పార్టీకి విరాళం(డబ్బు) ఇవ్వమని ఏ ఒక్కరోజు అయినా నోటితో అడిగారా చెప్పు,
కౌలు రైతులకి డబ్బులు ఇవ్వాలని పార్టీ నాయకులని లేదా నిన్ను అడిగారా? నువ్వు మాట్లాడిన గాలి మాటలకి ఒక్క ఆధారం అయినా చూపిస్తావా..? ఏంటి కేతాంరెడ్డి వినోద్ రెడ్డి ఇంత త్వరగా డ్యూటి ఎక్కుతావని అనుకోలేదు స్క్రిప్ట్ పంపారా లేక అది నువ్వే రాసుకున్నావా..?, నువ్వు మాత్రం ప్యాకేజీకి అమ్ముడుపోయావని మాత్రం ప్రజలందరికి అర్ధం అయింది అని తెలిపారు. మరోసారి జనసేన పార్టీ మీద గాని, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ గారి మీద గాని పిచ్చ పిచ్చ ప్రేలాపన్లు పేలితే ఖబాద్ధార్ అని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరాస్వామి, పెండ్యాల ఎంపీటీసీ వాకా ఇంద్ర గౌడ్, కారింకి వరప్రసాద్, యడ్లపల్లి సత్తిబాబు, తమ్మిరెడ్డి దుర్గారావు, రాచపోతు నవదుర్గ, ఏడిద శ్రీను మరియు జనసైనికులు పాల్గొన్నారు.