కళ్యాణదుర్గంలో శంఖరావం

కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గంలో నారా లోకేష్ పాల్గొన్న శంఖరావం సభలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ హాజరయ్యారు. ఈ సభలో జనసేన పార్టీ తరఫున ఇంచార్జ్ బాల్యం రాజేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని చెరువులకు కావలసిన నీరు గురించి, అధ్వానంగా ఉన్న రోడ్లు సమస్యల గురించి, స్థానిక వైసిపి ఎమ్మెల్యే మరియు మంత్రి ఉషశ్రీ చరణ్ యొక్క అవినీతి, భూకబ్జాలు, ఇసుక దోపిడీ గురించి, పలు ప్రజల సమస్యల గురించి వివరించారు. ఈ సమావేశానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో 5 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, వీరమహిళలు, పట్టణ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు జనసేన పార్టీ తరఫున భారీ సంఖ్యలో హాజరయ్యారు.