పాంచాలి నగర్లో శ్రీమతి వినుత కోటా పర్యటన

శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణం, పాంచాలి నగర్లో జనసేన పర్యటన శ్రీమతి వినుత కోటా పర్యటీంచడం జరిగింది. క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా రేణిగుంట పట్టణం, పాంచాలి నగర్ లో ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది, అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు పుష్ప, జనసైనికులు భాను, పెంచలయ్య, గుర్రప్పా, శ్రీనివాసులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.