గుండ్లకట్టమంచి గ్రామంలో పర్యటించిన శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలంలోని గుండ్లకట్టమంచి గ్రామంలో బంగారుపాళ్యం మండలాధ్యక్షులు కోడి చంద్రయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని దళిత వాడల్లో సీనియర్ జనసేన నాయకురాలు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పర్యటించారు. ఆ గ్రామ ప్రజలు వై.సి.పి. ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనలో అనుభవిస్తున్న కష్టాలను తెలియజేసి వాపోయారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ.. గ్రామంలో జనసేన పార్టీని, జనసైనికులను ఎదుర్కోలేక వారిని అనిచివేయాలని ప్రభుత్వ పథకాల విషయంలో, గ్రామ మౌళిక సదుపాయాలు అభివృద్ధి పరచకుండా జనసైనికులను వారి చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని, జనసైనికుని కుటుంబ సభ్యులు ఒకరు చనిపోతే, వారి మరణ దృవీకరణ పత్రం ఇవ్వకపోవడం వై. సీ. పి. యొక్క నీచమైన పాలనకు పరాకాష్ఠ. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా, ఊపిరి వున్నంత వరకు ప్రతి జనసైనికుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే మా లక్ష్యం అనడం నాకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇలాంటి జనసైనికుల ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తంబళ్ళపల్లి రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు కోడి చంద్రయ్య మరియు పవన్, కిరణ్, వంశీ, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-13-at-8.24.26-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-13-at-8.24.26-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-13-at-8.24.27-PM-1024x768.jpeg)