విశాఖపట్నం నోవాటెల్ నుండి విజయనగరం జిల్లా నేతల అరెస్ట్

విజయనగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నేతలతో, వీరమహిళలతో, జనసైనికులతో కలిసి సమీక్షలు మరియు జనవాణి కార్యక్రమం రీత్యా విశాఖకు వచ్చిన సందర్భంగా ఆయనకు ఉత్తరాంధ్ర మహిళా రీజినల్ కో ఆర్డినేటర్ అయినటువంటి శ్రీమతి తుమ్మి లక్ష్మీ రాజ్ పవన్ కళ్యాణ్ ని బొకేతో స్వాగతం పలికి వస్తుండగా.. మీడియా వారిని సంప్రదించగా తమ గళాన్ని వారికి వినిపిస్తుంటే ఇక్కడ మాట్లాడుకూడదు అని లక్ష్మీ రాజ్ ని మరియు వారితో ఉన్నటువంటి నాయకులు బోడసింగి రామకృష్ణ, బూర్లె విజయశంకర్, రాజారావు పిన్నింటి, గుమ్మడి శ్రీరామ్, ప్రసాద్ అను జనసైనికులను పోలీసులు అన్యాయంగా తీసుకువెళ్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మరియు ఇతర పోలీస్ స్టేషన్ లో వీరితోపాటు కోస్తా జిల్లాల నాయకులను కూడా నిర్బంధించి సుమారు సాయంత్రం వరకు విడువలేదు. ఇది అప్రజాస్వామ్యాకం అని, ప్రజా స్వామ్య దేశంలో పార్టీ అధినేతను కలవడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా అని ఆవిడ ఆవేదన చెందారు. ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకున్నా పార్టీ కార్యక్రమాలు ఆపేలా ఇలా నిర్బంధనలు చేయడం అరెస్ట్ చేయడం సిగ్గుచేటని వాపోయారు.