జనసేన తీర్థం పుచ్చుకున్న యువత

నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ లోని 33 వ వార్డుకు చెందిన పలువురు యువత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం నెల్లూరు మినిబైపాస్ లో ఉన్న జనసేన జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మాను క్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజయ్ బాబు లు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని 33వ వార్డుకు చెందిన షేక్ లాలూ, 6 వ వార్డుకు చెందిన రాముల ఆధ్వర్యంలో పలువురు యువత జనసేనలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి అధిక సంఖ్యలో యువత జనసేనలో చేరుతున్నారని అన్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించాలని కోరారు. ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు, కరెంటు చార్జీలు, నెల్లూరు లో క్రైమ్ విపరీతం గా పెరిగాయి. కిలో టమోటో ధర 120 రూపాయలు పలుకుతున్నా ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో విఫలం చెందిందని అన్నారు. పవన్ కళ్యాణ్ తోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.