వాలంటీర్ జగదీష్ అందరికి ఆదర్శం: గంగారపు రామదాస్ చౌదరి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక జనసేన పార్టీ సభ్యత్వాలు చేసి, రికార్డు సృష్టించిన వాలంటీర్ జగదీష్ అందరికి ఆదర్శం అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవలే కోలుకున్న జగదీష్ గౌరవార్థం మదనపల్లె అర్బన్ నందు క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లు అందరికీ జగదీష్ స్వగృహం నందు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిట్లు పంపిణీ చేసి, బీమా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, పట్టణ ప్రదాన కార్యదర్శి గండికోట లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి, రెడ్డెమ్మ, జనసైనికులు గోపాలకృష్ణ, నాగ, కల్లూరు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వం కిట్లు అందజేశారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాలంటీర్లకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ అభినందన పత్రం, జనసేన పార్టీ జెండా కండువా, దుశ్శాలువ, పూలమాలలు వేసి వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వారందరికీ అభినందనలు తెలిపారు.

క్రియాశీలక సభ్యత్వం కీలకం

మదనపల్లె రూరల్ మండలంలో సభ్యత్వాలు చేయించడంలో కీలకంగా వ్యవహరించిన మైఫోర్స్ మహేష్, జంగాల శివరామ్ రాయల్, ఆర్.బాబు, ఎం.శంకర్, నవీన్, కొలిమి ప్రసాద్ లను గంగారపు రామదాస్ చౌదరి ఘనంగా సన్మానించారు. పార్టీ రూరల్ మండలం అధ్యక్షులు రోనురి‌ బాబు ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిట్లు పంపిణీ, బీమా పత్రాలు ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, మైఫోర్స్ మహేష్, కిరణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అమరనారాయణ, నవీన్, అడపా సురేంద్ర, గండికోట లోకేష్, రెడ్డెమ్మ, కోలా నాగవేణి తదితరులు పాల్గొన్నారు.