లాలుపురం గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమం

ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, లాలుపురం గ్రామంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో 18 సంవత్సరములు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, జనసేన నాయకులు కాటూరి శ్రీనివాసరావు, గుంటూరు రూరల్ మండల నాయకులు తోట వెంకటేష్ మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.