స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కలెక్టర్ కి వినతిపత్రమిచ్చిన రేగిడి లక్ష్మణరావు

విజయనగరం, మెరకముడిదాం గ్రామంలో 400 ఇళ్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. స్మశానవాటిక లేక చెరువు గట్టుపై చనిపోయిన వారిని పూడ్చడం జరుగుతుంది. వర్షాకాలంలో దారిలేక ఇబ్బందిగా ఉందని, అందుకనే స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కి స్పందన కార్యక్రమంలో దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు మరియు విజయనగరం జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు వినతిపత్రం అందజేసి సమస్యకు పరిష్కారం కోరడం జరిగింది.