మేలుకో వినియోగదారుడా మేలుకో పోస్టర్ ఆవిష్కరణ

అనంతపురం, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఎన్.సి.అర్.సి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి ఏప్రిల్ 25 వరకూ మేలుకో వినియోగదారుడా మేలుకో కార్యక్రమం నిర్విస్తున్నట్లు ఎన్.సి.అర్.సి అంధ్రప్రదేశ్ అడ్వైజరీ కమిటీ బోర్డ్ చైర్మన్ మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మహేష్ డేగల అన్నారు. ఈ సందర్భంగా అనంతపూర్ నగర డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్యతో “మేలుకో వినియోగ దారుడా మేలుకో” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులే అని, వారి హక్కులను తప్పకుండా తెలుసుకోవాలని అన్నారు.