ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం: వాసు గౌడ్

  • కిడ్నీ వ్యాధి బాధితుడికి జనసేన ఆర్థిక సాయం

భూపాలపల్లి జిల్లాకు హెందిన జనసేన నాయకుడు రాజేష్ తండ్రికి రెండు కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చావుతో పోరాటం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకులు వాసు గౌడ్ రాజేష్ కుతుంబానికి 10,000 రూపాయల ఆర్ధిక సహాయం చేసారు. ఈ సందర్భంగా వాసు గౌడ్ మాట్లాడుతూ.. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, ఆపదలో ఉన్న మా జనసైనికులకైనా, సామాన్య ప్రజలకైనా అండగా ఉంటామని, మా పార్టీ పెద్దలనుండి సహాయం అందుతుందని వాసు గౌడ్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, అభి, సుమన్, సుధాకర్, పంజా, తదితర జనసైనికులు పాల్గొన్నారు.