ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారికి వరంగల్ జనసేన చేయూత

వరంగల్ రైల్వేస్టేషన్ మొదలుకొని ఖాజిపేట్ రైల్వేస్టేషన్ వరకు నగరరంలో ఫూట్పాత్లపై నివసిస్తున్న యాచకులకు, ఆశ్రయంలేని నిరాశ్రయులకు జనసేన నాయకులు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు గోళ్ళ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అనాధలకు దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. రాత్రి పదకొండు గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండ్, శివనగర్, చౌరస్తా పోచమ్మమైదాన్ హనుమకొండ బస్టాండ్ ఖజిపేట రైల్వేస్టేషన్ వరకు అన్ని కూడళ్లలో ని నిరాశ్రయులకు రాత్రి రెండు గంటలవరకు ప్రతి కూడలి తిరిగి దుప్పట్లు అందజేసామనారు. ఈ కార్యక్రమంలో గడ్డం రాకేష్, ముక్క అభిలాష్, అనుదీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.