వైసిపి ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు స్థానిక 7వ డివిజన్ డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం(గ్లోబ్ బొమ్మ) సమీపంలోని కమ్యూనిటీ హాల్ దగ్గర ప్రాంతంలో డివిజన్ అధ్యక్షులు పారుపల్లి చిట్టి శేఖర్ ఆధ్వర్యంలో దళితుల సంక్షేమ పధకాలని తీసేసిన జగన్ పై వై.సి.పి ప్రభుత్వం పై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే మొగుడిని కొట్టి మొగసాలికెక్కినట్టు ఉందనీ, ఒకపక్క దళితులకు ఎంతో ఉపయోగకరమైన ప్రభుత్వ పధకాలను తీసివేసి, ఇంకొకపక్క సభలలో నా ఎస్.సీ లు, నా ఎస్.టీలు అని ప్రేమ ఒలకబోస్తున్నాడన్నారు. దళితులని అధికారంలోకి రావడానికి వాడుకుని తీరా ముఖ్యమంత్రి అయ్యాకా వారు స్వశక్తితో ఆర్ధికంగా సామాజికంగా బలపడకుండా, కేవలం తన దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి బతికేలా చేయడమే జగన్మోహన్ రెడ్డి నైజం అని చదువుకున్న దళితులకి అర్ధమైందనీ ఇకపై మరోసారి మోసపోడానికి తయారుగా లేరనీ కాకినాడలోను, రాష్ట్రంలోను వై.సి.పి ని ఇంటికి పంపేందుకు మేము సిద్ధం అని అంటున్నారన్నారు. బుగ్గలు చిదిమి నెత్తిమీద చేయితో తట్టిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకి మేన మామ కాదనీ, కంస మామ అని దుయ్యబట్టారు. రాబోయే 50 రోజుల తరువాత జరిగే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీల కూటమికి మద్దతు ఇచ్చి వై.సి.పి ని రాష్ట్రం నుండి తరిమేందుకు మేము సిద్ధం అని నినదించారు. ఈ కార్యక్రమంలో బటాని రామకృష్ణ, మైలపిల్లి ఉమామహేశ్వర రావు, సామంతుల మనోహర్, కరుణాల అప్పారావు, మట్ట లక్ష్మణరావు, సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, సిటీ కమిటీ సహాయ కార్యదర్శి వాడ్రేవు లోవరాజు తదితరులు పాల్గొన్నారు.