యుద్దానికి మేమూ సిద్ధమే

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో పేర్రాజుపేట కనకదుర్గమ్మ గుడి ప్రాంతంలో సిటీ జనరల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో మన నివాసానికి ఇళ్ళు కావాలి మన కాకినాడలొనే అని అంటూ మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెపుతూ సభలు పెడుతున్నారనీ తాముకూడా ఆయన చెప్పినదానికి సమాధానం చెపుతున్నామని మేము కూడా సిద్ధం అని తెలియచేస్తున్నామన్నారు. మీరు ఎందుకు సిద్ధంగా ఉన్నారు దేనికోసం సిద్ధంగా ఉన్నారు అని అడుగుతూ కాకినాడలోని ప్రజలకు ఇళ్ళు ఇస్తామంటూ సిటీకి దూరంగా వేరే గ్రామంలోకి తోలేస్తూ ఖాళీచేసినందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కాకినాడ ప్రజలకు మీరు ఏంచేసారని సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడివాళ్ళందరికీ ఇక్కడ ఇళ్ళు ఇచ్చారనా లేక ఇక్కడే ఉపాధి కల్పించారనా సిద్ధంగా ఉన్నారని అడిగారు. ఈఊరి ప్రజలను ఈప్రాంతానికి దూరంచేస్తూ దూరంగా ఇళ్ళు అంటూ నగరబహిష్కరణ లాగా చేస్తున్న ఈ వై.సి.పి ప్రభుత్వ చర్యలని జనసేనపార్టీ తీవ్రంగా కండిస్తోందన్నారు. ఈనాడు కాకినాడలోని అన్ని వర్గాలూ మీరు పెంచిన ఆస్తిపన్నులకు, చెత్తపన్నుకు, కరెంటు చార్జీల పెంపుకి మిమ్మల్ని గద్దెదించేందుకు సిద్ధం అని అంటూ నినాదాలు చేసారు, ఈప్రాంతంలోనే వీళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని నినందించారు. కాకినాడలోనే ఇళ్ళు పొందే విధంగా వీరందరికీ జనసేనపార్టీ హామీ ఇస్తోందని తెలియచేసారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కాకినాడలోని ప్రతి పేదవాడికీ కాకినాడలోనే ఇల్లు ఇస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, పెద్దిరెడ్డి సత్యన్నారాయణ, కేర్లప్రసాద్, టేకు రాము, సుభాష్, ప్రతాప్ మరియు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.