కరెంటు బిల్లులు పెంచిన జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ గారి నాయకత్వంలో 21వ డివిజన్ జె.రామారావుపేట ప్రాంతంలో డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కరెంటు బిల్లులు పెంచిన జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటూ సభలు నిర్వహ్స్తున్నాడనీ ఎందుకంటే కరెంటు చార్జీలను మరింతపెంచి ప్రజలను పట్టిపీడించేందుకు సిద్ధమని, పేదలకు సంక్షేమ పధకాలు ఇస్తున్నామని చెపుతూ కరెంటు బిల్లులు సాకు చూపెట్టి ఎగ్గొట్టడానికి వై.సి.పి సిద్ధమనీ, అలాగే ఎన్నికలంటే యుద్ధమంటున్నాడనీ, పవన్ కళ్యాణ్ గారి నేత్రుత్వంలో జనసేన పార్టీ కూడా సిద్ధం అంటున్నామనీ మాకుతోడుగా ప్రజలు కూడా సిద్ధం అంటున్నారనీ ఈప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలుకూడా వీళ్ళని గద్దెదించడానికి మేము సిద్ధం అంటున్నారనీ ప్రజల సమస్యలు తీర్చడానికి జనసేనపార్టీ కూడా సిద్ధం అని నినందించారు. ఈ కార్యక్రమంలో దుగ్గన బాబ్జీ, మహేశ్వరరావు, తులసి, షేక్ అహ్మద్, గుత్తుల మల్లేశ్వరరావు, పిల్లి దుర్గారావు, షేక్ కరీం, చిక్కం సూరిబాబు, ఎండి అహ్మద్, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.