యశస్వినిపై అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నాం: రేగిడి లక్ష్మణరావు

విజయనగరం: బొగ్గుల దిబ్బ వద్ద నివాసముంటున్న నిరుపేదల ఇళ్ల తొలగింపును నిరసిస్తూ, బాధితుల తరుపున ప్రశ్నించినందుకు పాలవలస యశస్వినిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని రేగిడి లక్ష్మణరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంటనే ఆమెపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ఇలా తప్పుడు కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంస్కృతి రాజకీయాల్లో శ్రేయస్కరం కాదన్నారు. కేసులకు తమ పార్టీ నాయకులు భయపడే ప్రసక్తే లేదన్నారు. న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామన్నారు.