ఈనాడు కార్యాలయంపై వైకాపా మూకల దాడిని ఖండిస్తున్నాం

  • జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: వైకాపా శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై రాళ్లతో దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి తెలిపారు. తమ అవినీతిపై, ఆరాచాకలపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్న ఆక్రోశంతో మీడియాపై దాడులకు తెగపడటం వైసీపీ మూకలకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. వైసీపీ పాలనపై రాస్తున్న వాస్తవాలను జీర్ణించుకోలేక దాడులు చేయటం సిగ్గుచేటన్నారు. చొక్కాలు మడతపెట్టే సమయం ఆసన్నమైందంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే రెచ్చగొట్టటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం లాంటి మీడియాపై జరుగుతున్న దాడుల్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వాదులపై ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ మూకలు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్నందున పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని ఆళ్ళ హరి కోరారు.