రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం: రాజంపేట జనసేన

రాజంపేట: ఆదివారం రాత్రి రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని రాజంపేట జనసేన నాయకులు పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సోమవారం రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు జరుపుకోవడం సర్వసాధారణమని అయితే పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం భావ్యం కాదని తెలిపారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, భాస్కర్ పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, పోలిశెట్టి చంగల్ నాయుడు, తాళ్లపాక శంకరయ్య, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.