ఓడిపోయాం అంతే ఆగిపోలేదు: శ్రీమతి కీర్తన

చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి కీర్తన సామాన్య వర్తకులకు జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్లు ఇచ్చి జనసేన సిద్ధాంతాలను వివరించారు. ఈ సందర్భంగా కీర్తన మాట్లాడుతూ… ప్రజలను ప్రలోభపరిచి గెలిచారేమోగానీ, శ్రి పవన్ కళ్యాణ్ పైన వారి మనసులో ఉన్న అభిమానం, నమ్మకం అయితే చెక్కు చెదరలేదని, మీ నీచ రాజకీయాలకు ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని నమ్మకం కలుగుతోందని, జనసేన పార్టీ ఓడిపోయామంతే కాని ప్రజలకు న్యాయం చేయడంలో ఆగిపోలేదని అన్నారు.