గిద్దలూరు నియోజకవర్గ కమిటీల ఏర్పాటు

గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఆరు మండలాల పరిధిలో జనసేన మండల అధ్యక్షులను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఐదు మండలాల అధ్యక్షులు ఇంఛార్జి శ్రీ బెల్లంకొండ సాయిబాబుని కలసి సన్మానించి పూలమాలలు వేశారు. ఇంఛార్జి మాట్లాడుతూ త్వరగా పూర్తిగా మండల కమిటి సభ్యులను మరియు గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. మండల అధ్యక్షుడు ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ, కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్, అర్ధవీడు మండల అధ్యక్షుడు కలగొట్ల అల్లురయ్య, రాచర్ల మండల అధ్యక్షుడు పుట్టా బాలకృష్ణ, గిద్దలూరు మండల అధ్యక్షుడు పగడాల సాయి ఈశ్వర్, కొమరోలు మండల అధ్యక్షుడు సారె ఓబులేసు, రాచర్ల మండల నాయకులు ఇప్పల శేషాద్రి, అలిశెట్టి వెంకటేశ్వర్లు, కంభం మండల నాయకులు షేక్ అజ్జు, కొమరోలు మండలం నాయకులు భూమ లక్ష్మణ్, హర్ష తదితరులు పాల్గొన్నారు.