జనసేన క్రియాశీలక సభ్యునికి, వారి కుటుంబానికి అండగా ఉంటాం: నాదెండ్ల

గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు అన్నపురెడ్డి నాగ శివయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో నాగ శివయ్య కుటుంబాన్ని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అతని భార్య శ్రీమతి పావనికి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల బీమా చెక్కుని ఆమెకు అందజేశారు. పార్టీ తరఫున అన్ని విధాల ఆ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన చికిత్స పొందుతున్న మరో ముగ్గురు క్రియాశీలక సభ్యులు మెడికల్ క్లైమె చెక్కులు మనోహర్ అందజేశారు. తాడికొండ నియోజకవర్గం కొర్రపాడు కు చెందిన శ్రీ హరి గోపాల్కు 50,000 రూపాయలు, గుంటూరు పట్టణానికి చెందిన దాసరి హరికృష్ణ బాబుకు 50,000 రూపాయలు, రేపల్లె నియోజకవర్గం పెనుమూడి గ్రామానికి చెందిన ఆళ్ల నాగ శ్రీధర్ కు 25 రూపాయలు, 25 వేల చెక్ ను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శివ శ్రీనివాసరావు, గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ , పార్టీ నేతలు శ్రీమతి బడే కోమలి, సామల నాగేశ్వరరావు, వాసా శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.