జనసేనాని నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: ఎచ్చెర్ల జనసేన

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం హెడ్క్వార్టర్స్ లో గురువారం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు సంక్షేమ కోసం నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటూ మాసంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ కలిసి 2024 సంవత్సరంలో సరికొత్త ప్రభుత్వం స్ధాపించాలని గురువారం రణస్థలం మండలంలోని ప్రెస్ మీట్ లో జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల జనసేన నాయకులు వడ్డాది శ్రీనువాస్, దాసరి బలరాం, పోట్నూరు లక్ష్మునాయుడు, ఇజ్జిరొతు రమణ, దన్నాన రవింద్ర, మాగుపిల్లి అప్పన్న, కోలగాన రామకృష్ణ, పిట్ట వేణు, తూలుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.