సొంత నిధులతో బోరు వేయించిన అతికారి దినేష్

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, అన్నమయ్య వరదలు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ వరద ప్రాంతల పరిస్థితి ఇప్పటికి ఏమైన మారిందా అని గ్రామాలను సందర్శించాడనికి వెళ్లినప్పుడు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన తోగురుపేట గ్రామ ప్రజలు ఇక్కడ నీరు దొరక్క ఎంతోమంది చెయ్యేరు నదిలో చెలిమి తీసుకొని నీరు త్రాగుతున్నారు, అదేవిధంగా తమ ఊరి అవసరాల నిమిత్తం కూడ నీరు అవసరం అయినప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని ఊరిలో మీరు బోరు వేయించమని గ్రామస్థులు అడగటంతో వెనువెంటనే బోరు వేయిస్తాను అని మాట ఇచ్చిన అతికారి దినేష్, ఇచ్చిన మాట ప్రకారము తన సొంత నిధులతో రెండు రోజుల్లో బోరు వేయించిన అతికారి దినేష్ ని గ్రామస్థులు పవన్ కళ్యాణ్ ఆడుగుజాడల్లో నడుస్తున్న గొప్ప వ్యక్తి అని ప్రజల అవసరాలు తీరుస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ని, అతికారి దినేష్ ని అభినందించారు.