వంగవీటి రంగా స్ఫూర్తిని కొనసాగిస్తాం

• జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
• విజయవాడలో శ్రీ రంగా వర్ధంతి సందర్భంగా నివాళి

‘ప్రజలకు అంకితమై సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు శ్రీ వంగవీటి మోహన రంగా గారు’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. సమాజం కోసం, ప్రజల కోసం ఆయన నిలబడిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సమాజంలోని ప్రతి పేదవాడిలో సంతోషం నింపే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. మాజీ శాసన సభ్యులు వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని విద్యాధరపురంలో ఆయన విగ్రహానికి నాదెండ్ల మనోహర్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రంగా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, పార్టీ నేతలు బొలిశెట్టి వంశీకృష్ణ, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, వెన్నా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.