అవినీతి నాయకులను బలంగా ఎదుర్కొంటాం: బాబు పాలూరు

లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీ గురించి తెలియని వారు తెలుసుకోని వారు ఉండరు ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వల్ల చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలు రాక రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసు అలాగే రైతులు కోసం జనసేన పార్టీ ఎంత పోరాటం చేసిందో కూడా అందరికి తెలుసు. ఆనాడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మరియు సీతానగరం మండల నాయకులు అలాగే బొబ్బిలి నియోజకవర్గం, పార్వతీపురం నియోజకవర్గం, కురుపాం నియోజకవర్గ జనసైనికులు అంతా కలిపి చొరవ తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తే, అక్రమ అరెస్టులు చేసి ఆరోజు దాదాపు 4 పోలీస్ స్టేషన్స్ తిప్పించారు, కానీ ఆయనను మరియు ఆయన తండ్రిని ఈ చేతకాని ప్రభుత్వం, రైతులను నిలువునా ముంచేసిన దగాకోరు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, కోర్టుల చుట్టూ తిప్పుతుంది. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? రైతులకు న్యాయం చెయ్యమని కోరితే ఇలా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం ఎంత వరకు న్యాయం? మీరు ఇలా ఎన్ని కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిన మేము మాత్రం ప్రజా సమస్యల గురించి పోరాడుతూనే ఉంటాము. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టాండ్ ఒక్కటే ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ రైతు కన్నీరు పెడుతున్నాడో అక్కడ జనసేన పార్టీ ఉండి వారికి న్యాయం చేసేదాకా పోరాడాలి అని మాకు సూచించారు, మేము మా అధ్యక్షుల వారి మాటను తూచా తప్పకుండా పాటిస్తాం, మీలాంటి అవినీతి నాయకులు ఏమి చేసుకున్నా మేం బలంగా ఎదుర్కొంటాం అని బాబు పాలూరు పేర్కొన్నారు.