పవనన్న పాలనతోనే పేదల సంక్షేమం

  • ఇంటింటికి తిరిగి కరపత్రాలను అంద చేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయి పాలన సాగిస్తేనే రాష్ట్రంలోని పేదల సంక్షేమం సాధ్యమవుతుందని రాజంపేట జనసేన పార్టీ నాయకులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 31వ రోజు రాజంపేట నియోజకవర్గం మందరం పంచాయతీలోని కుప్పవారిపల్లె, సీతారాంపురం, ఇండ్రోపల్లె, మందరం కొత్తపల్లె,మందరం, గొల్లపల్లె, రాచపల్లి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలు అందచేసి పెరిగిన నిత్యావసర ధరలు విద్యుత్ చార్జీలు పేదలపై ఎంత భారంగా మారాయి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి పాటల రామయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసేన వీర మహిళలు పోలిశెట్టి రజిత, జడ్డా శిరీష, రేవతి, బండి లక్ష్మీదేవి, పావని, తులసి, మరియు జనసేన నాయకులు భాస్కర్ పంతులు, మన్నూరు గోపి, తాళ్లపాక శంకరయ్య, వీరయ్య ఆచారి, కిషోర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన వీరమహిళలు అభిమానులు పాల్గొన్నారు.