గజపతినగరంలో జనసేన జెండా ఎగరేస్తాం: మర్రాపు సురేష్

  • జనసేన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

గజపతినగరం నియోజకవర్గం: గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో గజపతినగరం నియోజవర్గం కేంద్ర కార్యాలయం, నియోజకవర్గ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం నూతనంగా పార్టీలో చేరిన టిడిపి మాజీ మంత్రి పడాల అరుణను నియోజకవర్గ నాయకులు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీని ఒక సైనికురాలుగా పార్టీ బలోపతానికి కృషి చేస్తానని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని లక్ష్యంతో జనసేన పార్టీలో చేరానని తెలియజేశారు. నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ మాట్లాడుతూ.. పడాల అరుణ గారు పార్టీలో చేరడం చాలా సంతోషమని, ఆమె అనుభవం రేపటి తరానికి మార్గాన్ని చూపించాలని, మాలాంటి యువ నాయకులకు ఆమె అనుభవాలు చాలా ఉపయోగపడతాయని తెలిపారు. రానున్న ప్రజా ప్రభుత్వంలో గజపతినగరం నియోజకవర్గంలో జండా ఎగరేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అడ్డడా మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన, రమేష్ రాజు, నియోజకవర్గ నాయకులు, గజపతినగరం పండు, ఆదినారాయణ, రాజీవ్, శ్రీను, మహేష్, దుర్గ, పిరు దత్తిరాజేరు లక్ష్మణ, అనిల్, అశోక్, చరణ్, సూర్య, అప్పారావు, బొండపల్లి నారాయణ రావు, గౌరిన నాయుడు, నాగరాజు గంట్యాడ ప్రశాంత్ జామి రాంబాబు, వర్మరాజు ఆదినారాయణ, ఈశ్వరరావు, నవీన మండల, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.