జనసైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: నేరేళ్ళ సురేష్

గుంటూరు: మీకు అన్నివిధాలా పార్టీ అండగా ఉంటుంది అధైర్యపడకండి అని పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రమాదాలకు గురైన జనసైనికులకు గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ భరోసా ఇచ్చారు. ఈ నెల 18 న కౌలు రైతు భరోసా సభకు విచ్చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రమాదానికి గురైన జనసైనికులను గురువారం ఆయన పరామర్శించారు. ఏటుకూరు రోడ్డులో మరియు అంకిరెడ్డి పాలెం వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జానకిరామయ్య, సానికొమ్ము చంద్రశేఖర్ రెడ్డి లకు నెరేళ్ల సురేష్ ధైర్యం చెప్పారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకొని బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను నెరేళ్ల సురేష్ కోరారు. కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు యడ్ల నాగమల్లేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు విష్ణుమొలకల ఆంజనేయులు, యాట్ల దుర్గ ప్రసాద్, షేక్ రజాక్, బందెల నవీన్, పులిగడ్డ గోపి, ఆకుల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.