రైతు భరోసా యాత్ర సభ ఏర్పాటుకు ఏవిదమైన సహాయ సహకారాలైనా అందిస్తాం: మాకినీడి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రైతు భరోసా యాత్ర మండపేట నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈ నెల 16 వ తేదీన మండపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం నిమిత్తము మండపేట శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్ లో జిల్లా నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే బహిరంగ సభకు మా నియోజకవర్గం తరపున ఏవిదమైన సహాయ సహకారాలైనా అందిస్తాం అని తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు మండపేట ఇంచార్జ్ వేగుళ్ళ లీలా కు తెలియజేయడం జరిగింది.