జనంలోకి జనసేన సిద్ధాంతాలు.. గ్రామ గ్రామాన ఇంటింటికి జనసేన

*కరపత్రాలను అందజేస్తున్న జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 లో ముఖ్యమంత్రి కావాలని జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమంలోభాగంగా17వరోజు మాధవరం-1గ్రామ పంచాయతీలోని పలు గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనసేన పార్టీ విధివిధానాలు పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో రూపొందించిన అంశాలను సామాన్య ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైయస్సార్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావాలని చెప్పారు. వచ్చేఎన్నికల్లో ప్రజలంతా జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.