అడ్డదారుల్లో గెలిచేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం: బోనబోయిన

గుంటూరు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని సిఎం జగన్మోహన్ రెడ్డి అక్రమ మార్గాల్లో గెలిచేందుకు చేస్తున్న కుట్రలను జనసేన పార్టీ అడ్డుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు పశ్చిమ ఇంచార్జీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం జనసేన నగర సంయుక్త కార్యదర్శి కొత్తకోట ప్రసాద్, జనసేన నేత అరవింద్ జైన్ సంయుక్త ఆధ్వర్యంలో 32, 33 డివిజన్లలో ఉచిత ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి చేరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టిడిపి జనసేనపార్టీలు ఉమ్మడి కార్యాచరణతో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజల సహకారంతో గద్దె దింపుతామన్నారు. తమ రెండు పార్టీలు కలసి రానున్న కాలంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని జోస్యం చెప్పారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ జగన్ తన పాద యాత్రలో ఇచ్చిన హామీలన్నీ నీటిమూటనని ప్రజలకు తేట తెల్లమైందన్నారు. వైస్పిని ప్రజలు విశ్వసించే పరిస్తితులు లేవన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పార్వతి నాయుడు, అడపా మాణిక్యాలరావు నారాదాసు రామచంద్ర ప్రసాదు, చట్టాల త్రినాథ్, శిఖా బాలు, చింతా రాజు, బొడ్డుపల్లి రాధా కృష్ణ మూర్తి, శ్రీపతి భూషణం ,ఘంటసాల ఫణీంద్ర, నెల్లూరు రాజేష్,మధులాల్, దాసరి వెంకటేశ్వరరావు, కొలసాని బాలకృష్ణ, పవన్ వెంకీ, చెన్నం శ్రీకాంత్, కిరణ్, చింతకాయల శివ తదితరులు పాల్గొన్నారు. 32 డివిజన్ సభ్యులు అధ్యక్షుడు చందు శీనువాసురావు గడ్దం చిరంజీవి వీరవెంకటరావు నల్లిబోయిన అనిత తదితరులు పాల్గొన్నారు మరియు గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయడం జరిగింది.