యల్లటూరుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

అనంతపురం: ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఉన్న యల్లటూరు భవన్, జనసేన పార్టీ కార్యాలయంలో రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలం నీలంవారి పల్లెకు చెందిన జనసేన పార్టీ జనసైనికుడు
గురుప్రసాద్ రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజుని కలిసి శాలవా బొకేలతో సత్కరించి తన వివాహానికి ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా గురుప్రసాద్ మాట్లాడుతూ తన వివాహానికి తప్పక హాజరవుతానని యల్లటూరు శ్రీనివాస రాజు హామి ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుప్రసాద్ వెంట కె.మనోహర్, కె. నాగరాజు, యస్.మదన్ కుమార్, యస్. అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.