ఫ్రేజర్‌పేట ప్రాంతంలో దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు ఫ్రేజర్‌పేట ప్రాంతంలో బుధవారం మావులూరి సురేష్ & రాగిణీల ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులు వీరబాబు గారిని, వెంకట లక్ష్మిని, షేక్ కరీముల్లానీ కలిసి వారి బాగోగులని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలలో దివ్యాంగుల పాత్ర ఉందనీ, ఒకదానిలో ఉన్న లోపం వారి లక్ష్యాన్ని అడ్డుకోలేదనీ కాకపోతే మనం కాస్త తోడు ఉంటే చాలన్నారు. అలాంటిది గత నాలుగున్నర ఏండ్ల నుండీ ఈ వై.సి.పి ప్రభుత్వ పాలనలో దివ్యాంగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారన్నారు. ఎంతో మేళ్ళు చేస్తున్నామని చెప్పుకునే ఈ వై.సి.పి ప్రభుత్వం మరి స్వల్పశాతమున్న దివ్యాంగులకి ప్రత్యేకంగా వీరికి చేసిన సంక్ష్యేమం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రతీదానికీ నవరత్నాలలోని లబ్దిదారులను లెక్కపెట్టి ఆయా వర్గాల ఖాతాలో చెప్పేసుకుంటూ నాలుక మడతని చాక చక్యంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.